దేవరకొండ: గొట్టిముక్కల రిజర్వాయర్లో ముంపుకు గురువుతున్న లింగన్నబావి, పూతల్రాంతండా బాధితులకు చింత పల్లి మండలంలోని సాయిబాబా ఆలయం సమీపంలో 110 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల సర్టిఫికెట్లను బుధవారం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అందజేశారు. లింగన్నబావిలో 49, పూత ల్రాంతండా 61 మంది లబ్ధిదారులకు 240 గజాల చొప్పున ఇండ్ల స్ధలాల పట్టాలు పంపిణీ చేశారు.
సర్వే నంబర్ 154 ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలకు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక డ్రా పద్దతిన ఎంపిక చేయను న్నట్లు ఆయన తెలిపారు. ఇండ్ల స్థలాలు కేటాయించగా ఇంటి నిర్మాణం ఖర్చులకు ప్రభుత్వమే రూ.7.61 లక్షలు ఇవ్వ నున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలోనే ముంపుకు గురవుతున్న లింగన్నబావి, పూతల్రాంతండాలో ఉన్న ఇండ్ల చెల్లిం పులు పూర్తి చేశారు. కార్యక్ర మంలోస్పెషల్ డిప్యూటీ, తహసీల్దార్ కిరణ్మయి, ఆర్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.