దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షే పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గానికి చెందిన 39 మంది బాధితులకు రూ.11.79 లక్షల సీఎం సహయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి సహకారంతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దవాఖానలో వైద్య కోసం వెళ్లిన వారికి ఆర్థికంగా తొడ్పాటయ్యేందుకు సీఎం సహాయ నిధి చెక్కులు ఎంతో అసరాగా ఉంటుందన్నారు.
కార్యక్రమంలో మున్సిల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, మండల రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మన్ వల్ల పురెడ్డి, టీఆర్ఎస్ నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, పున్న వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ రహత్అలీ, వేముల రాజు, జెల్లా రేణుగౌడ్, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.