కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మంగ ళవారం కావడంతో భకులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు, అభిషేకాలు నిర్వహించారు. ఆల యంలో తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుక అమ్మవారు గాజులమ్మ తల్లిగా భక్తులకు దర్శనమిచ్చింది.
భక్తులు తలంబ్రాలు, సారే, చీర, పూలు, పండ్లు కొబ్బరి కుడకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళ భక్తులు బోనాలతో వచ్చి రేణుక అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. కార్యక్రమంలో ఈవో ప్రభాకర్ సత్యమూర్తి, చైర్మన్ నల్లబోతు యాదగిరి, అర్చకులు మల్లాచారి, శ్రవణాచారి, సిబ్బంది జినుకుంట్ల చంద్రయ్య, లింగయ్య, లింగస్వామి, ఉపేం దర్రెడ్డి, నాగరాజు, అంజనేయులు పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.