నల్లగొండ : దళతుల ఆర్థిక స్వావలంభన, సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్లోని శాలపల్లి వేదికగా నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ బృహత్ కార్యక్రమాన్ని తిలకించి దళిత జనోద్ధరణకు పాటుపడుతున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రెండు ఏసీ బస్సుల్లో 120 మంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హుజూరాబాద్ కు బయల్దేరారు.
క్యాంపు కార్యాలయం వద్ద బస్సులకు జెండా ఊపి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాలుట్ల బాబయ్య , మాజీ సర్పంచ్ ఏడుకొండలు, కౌన్సిలర్లు అయోధ్య, గోవిందరెడ్డి, శ్రీను, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, సర్పంచ్ రవీందర్ నాయక్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.