హాలియా: రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం ఆయన కొవిడ్ నియంత్రణలో భాగంగా కొవీషీల్డ్ ఫస్ట్ డోస్ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లను సమర్థవంతంగా ఎదు ర్కోన్న రాష్ట్ర ప్రభుత్వం ధర్డ్ వేవ్ రాకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదన్నారు.
మానవ తప్పిదాల వలన థర్డ్ వేవ్ కూడా వస్తే ఎదుర్కోనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలైన మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనలు పాటిస్తే కొవిడ్ థర్డ్ వేవ్ రాకుండా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు తప్పక ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు. కొవిడ్ టీకాపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను ఎవరూ నమ్మొద్దని కోరారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీఎం సహాయనిధి పథకం పేదలకు వరమని నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళ వారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాడ్గులపల్లి మండలం ఆభం గాపురం గ్రామానికి చెందిన నాగమణి భర్త ఆదిరెడ్డి కి రూ.23,000 వేల చెక్కు, సావిత్రి భర్త కరుణాకర్కు రూ. 22,000 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీ స వైద్య ఖర్చులు కూడా పెట్టుకోలేని నిరుపేద ప్రజల కోసం సీఎం సహాయనిధి ఉపయోగ పడుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ స్కీమ్ను ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆభంగాపురం సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.