నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు శనివారం ప్రారంభించారు. నల్లగొండ ఎన్ఆర్ఐ ఫోరం సహకారంతో మిర్యాలగుడ బకల్వాడ పాఠశాలలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
అదేవిధంగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను నేరుగా కలసి సౌకర్యాలపై అరా తీశారు. ఇబ్బంది ఉంటే నేరుగా ఫోన్ చేయాల్సిందిగా (9848484303) సూచించారు. పేద ప్రజల ఆరోగ్యంపై రాజకీయాలు చెయొద్దని.. ఆక్సిజన్, బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యుత్ కోత లేకుండా చూడాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు.