హాలియా: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఆదివారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హాలియాకు చెందిన తారిటి మారుతిరావు56,000, నిడమనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జే. సైదమ్మకు రూ.18,000, దేవేందర్కు రూ.60,000వేల చొప్పున మంజూరైన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదరికంలో జన్మించి కనీస వైద్యఖర్చులు కూడా చెల్లించలేని వారి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహయనిధిని (సీఎంఆర్ఎఫ్) అందజేస్తున్నారని తెలిపారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్గిరెడ్డి లింగారెడ్డి, హాలియా మున్సిపాల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, శ్రీను, రాము, కుంచం దేవేందర్ పాల్గొన్నారు.