చందంపేట: మండలంలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని సర్కిల్ తండా, పాత కంబాలపల్లి, కంబాలపల్లి, పోగిళ్ల గ్రామాల్లో అటవీ ప్రాంతంలో ఉన్న రైతుల భూములను అటవీ శాఖ అధికా రులు, రెవిన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే, కలెక్టర్కు వివ రించారు. నెలరోజుల నుంచి అటవీ శాఖ అధికారు ల, రైతుల మధ్య భూ సమస్యలపై తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలకు చెందిన కొం తమంది రైతులపై కేసులు సైతం నమోదయ్యాయి, ఈ క్రమంలో సమస్యను గ్రామాలకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధు లు స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి జగదీశ్ రెడ్డి సూచన మేరకు ఆయా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.
నాగార్జునసాగర్ కట్ట నిర్మాణంలో ముంపునకు గురై అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన భూమితో పాటు సమీపంలో ఉన్న భూములను సేద్యం చేసుకొని జీవనం గడుపుతున్నామని ఆయా గ్రామాలకు చెందిన రైతులు వారికి మొర పెట్టుకు న్నారు. 60 సంవత్సరాల నుంచి భూములను సేద్యం చేసుకొని పంటలు సాగు చేస్తుండగా ఇటీవల అటవీశాఖ అధికా రులు అటవీ ప్రాంతానికి సంబంధించిన భూములని ఆయా భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారన్నారు.
మా ముత్తాత కాలం నాటి సమాధి సైతం మా పొలంలో ఉందని కలెక్టర్కు చూయించారు. పంటలు సైతం సాగు చేయ కుండా అడ్డుకుంటున్నారన్నారు. స్పందించిన జిల్లా అధికారులు ఎమ్మెల్యేతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి అట్టి భూము లను పరిశీలించారు. పోగిళ్ల, కంబాలపల్లి గ్రామాల్లో రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ 2014 సంవత్సరం ముందు వరకు సేద్యం చేసుకున్న భూములలో మాత్రమే పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు.
వాస్తవ రైతులను గుర్తించి భూ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించే విధంగా సర్వే బృందంతో సర్వే చేయిస్తామన్నా రు. రైతులు ఎటువంటి ఆందోళన చెందొద్దని, రైతుబంధు పొందని రైతులకు సైతం రైతుబంధు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ రైతుల పొలాల విషయంలో అటవీశాఖ అధికా రులు ఇబ్బందులకు గురి చేయొద్దని అన్నారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు అడ్డుకున్న భూముల్లో రైతులు పంటలు వేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
రైతులకు అన్ని విధాలా న్యాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్ న్యాయం చేస్తారన్నారు. త్వరలో భూ సమస్యలపై ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రత్యేక కమిటీతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు. రైతులు అటవీశాఖ అధికారులకు సహకరిస్తే అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో ఉన్న కేసులను ఎత్తేయాలని పోలీసులను కోరారు.
వారి వెంట డీఎఫ్వో రాంబాబు, ట్రైనీ కలెక్టర్ అప్రు చౌహన్, ఎంపీపీ పార్వతి, ఎఫ్డీవో సర్వేశ్వర్, తహసీల్దార్ దేవదాస్, ఎంపీడీవో రాములు నాయక్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, రాజవర్దన్ రెడ్డి, సర్పం చ్లు రోజా రవినాయక్, మద్దిమడుగు రవి, ముత్యాల రవి, మాజీ ఎంపీపీ గోవింద్, ఎంపీటీసీ బిక్కూ నాయక్, మున్న య్య యాదవ్, మల్లేశ్యాదవ్, శంకర్ నాయక్, బాలు నాయక్, మోహన్, డీఎస్పీ ఆనంద్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, మల్లారెడ్డి, అనంతగిరి, ముత్తు, బెజవాడ వెంకటయ్య, ఎఫ్ఆర్వో రాజేందర్ పాల్గొన్నారు.