చందంపేట: మండలంలోని సర్కిల్ తండా, కంబాలపల్లి, పోగిళ్ల గ్రామాల్లో వివాదంలో ఉన్న రైతుల భూములను పరిశీలిం చేందుకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్లు బుధవారం ద్విచక్ర వాహనం పై వెళ్లారు.
భూముల పరిశీలనకు రహదారి సరిగా లేకపోవడంతో కొంత మేర కాలినడకన వెళ్లారు. అనంతరం ద్విచక్ర వాహనంపై కొద్దిదూరం వివాదంలో ఉన్న భూములను పరిశీలించారు. వారి వెంట డీఎఫ్వో రాంబాబు, ఎఫ్డీవో సర్వేశ్వర్, ఎఫ్ఆర్వో రాజేందర్ ఉన్నారు.