నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేని బీజేపీ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నిక ఫలితం వెల్లడి అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఒక్క సీటు గెలిచే బీజేపీ వాళ్ళు భూమి మీద ఆగలేదు. చిల్లరగా మాట్లాడారన్నారు. మరోవైపు జానారెడ్డి ఎన్ని అభూత కల్పనలు మాట్లాడిన ప్రజలు నమ్మలేదన్నారు. సాగర్ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారన్నారు. విజయం కోసం కృషి చేసిన వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. మరోసారి తెలంగాణ సమాజం అంత సీఎం కేసీఆర్ వెంటే నడిచిందన్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఇప్పటికైనా సోయి రావాలన్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అన్నారు.
నోముల భగత్ మాట్లాడుతూ.. తనని గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నమ్మకం విజయం సాధించిందన్నారు. సీఎం కేసీఆర్కు, సాగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు.