పెద్ద అడిశర్లపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెడుతూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పీఏపల్లి కమ్యూనిటీ హాలులో 75మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ బిడ్డ వివాహాం చేసిన పేద కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా వారికి అండగా నిలిచేందుకు కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశ పెట్టారన్నారు.
మహిళల కోసం షీం టీం, కాన్పు సమయంలో కేసీఆర్ కిట్ లాంటివి ప్రవేశ పెట్టారని గిరిజన ప్రాంతాలలో ముఖ్యంగా ఆడ పిల్లలపై వివక్షతను విడనాడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాధ, ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, సర్పంచ్ గోర్ల సైదమ్మ, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి పాల్గొన్నారు.