భువనగిరి కలెక్టరేట్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు, సమస్యాత్మక లోతట్టు ప్రాంతాలు, బ్రిడ్జీలు, కల్వర్టులు, కాజ్వేల వద్ద సిబ్బందిని నియమించి 24గంటల పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, దీపక్తివారీ, డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీవోలు, మండల ప్రత్యేకాధి కారులు, తహసీల్దార్లు, ఎంపీ డీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్, నీటిపారుదల, ఆర్ ఆండ్ బీ, విద్యుత్ ఇంజినీర్లు, తదితర జిల్లా అధికారుల తో వర్షాలు, వరదల కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నందున అన్ని స్థాయిల అధికారులు మండల హెడ్క్వార్టర్లలోనే ఉండాలని ఎట్టి పరిస్థితు ల్లో బయటకి వెళ్లొద్దని అన్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నివేదికలు అందజేయాలన్నా రు. ఏ విధమైన ఘటన చోటు చేసుకు న్నా వెంటనే స్పందించాలన్నారు.
పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో ప్రమాద ప్రాంతాల్లో తాత్కాలిక బారికేడ్లను ఏర్పాటు చేయా లన్నారు. ప్రమాద సూచికలు, ఫ్లెక్సీలు ప్రదర్శించాలని, 24గంటలు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పల్లెప్రగతిలో నియమించిన యూత్ కమిటీలను సిద్ధంగా ఉంచుకోవాలని, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో, వీఆర్ఏలు పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టాలు సంబవించకుండా సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. సహాయక చర్యల కోసం కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన 08685234020టోల్ఫ్రీ నంబరుకు సమాచారాన్ని అందించాలన్నారు.