నల్లగొండ : దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాచరాజుపల్లి గ్రామశివారులో ఈ ఘటన జరిగింది. చందంపేట మండలం యల్మల మంద గ్రామానికి చెందిన కొందరు దామరచర్ల మండలంలోని కల్లేపల్లి మైసమ్మ ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కచరాజుపల్లి వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.