నల్లగొండ : కరోనా మహమ్మారి నేపథ్యంలో అవసరాన్ని, ఆపదను ఆసరాగా చేసుకుని ఆస్పత్రులు అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఐజీ రంగనాథ్ హెచ్చరించారు. కొవిడ్ విజృంభన నేపథ్యంలో రోగుల సహాయక చర్యలపై చర్యలపై డీఐజీ స్పందిస్తూ.. కరోనా మందులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా టెస్టింగ్ కిట్స్, రెమిడిసివర్ అధిక ధరలకు విక్రయిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్ల విషయంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనుమతి లేకుండా చికిత్సలు, అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు.