అడ్డగూడూరు : రాఖీ పౌర్ణమి సందర్బంగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నివాసంలో ఆయన సోదరి జ్యోతి రాఖీ కట్టి స్వీటు తినిపించారు. మండలంలోని ధర్మారం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల
సామేల్కు ఆయన సోదరి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రక్షాబంధన్ పర్వదినం సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని అన్నారు.