నల్లగొండ: జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికుల సహకారంతో దవాఖానకు తరలించారు. బాధితులంతా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా మొక్కులు చెల్లించుకునేందుకు జాన్పహడ్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..