శాలిగౌరారం: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఇటీవల నిర్మించిన అదనపు గోదాములు, శాలిగౌరారంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించేందుకు ఈ నెల 28న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో సోమవారం మార్కెట్ యార్డు, రైతు వేదికను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు హాజరయ్యే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు భారీగా హజరై విజయవంతం చేయాలని విజ్ణప్తి చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, గుండా శ్రీనివాస్, గుజిలాల్ శేఖర్బాబు, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, సర్పంచ్లు గౌర వీరయ్య, బట్ట హరిత, ఎంపీటీసీ పాక రాములు ఉన్నారు.