జిల్లాలో 92 రైతు వేదికలు
ఒక్కో వేదికకు 22 లక్షలు
ఆధునిక హంగులతో సకల సౌకర్యాలతో నిర్మాణాలు
ఆలేరు రూరల్, జూలై21: రైతుబంధు రైతు శిక్షణ కార్యక్రమా ల కోసం రైతులను ఒకే చోటకు చేర్చి సమావేశాలు నిర్ణయించ డానికి వ్యవసాయాశాఖకు ఇప్పటి వరకు సరైన వేదికలు అం దుబాటులో లేవు. వీటన్నింటినీ నిర్వహించేందుకు నిర్ణీత స్థ లం, భవనాలు లేకపోవడంతో రైతులకు, అధికారులకు ఇబ్బం దులు ఎదురయ్యేవి. గతంలో వ్యవసాయశాఖ అధికారులు చె ట్ల కింద, పంచాయతీ కార్యాలయాల్లో, కమ్యూనిటీ భవనాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ సమస్యను అధిగ మించడానికి సీఎం కేసీఆర్ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆరుగాలం కష్టించే అన్నధాతలకు వ్యవసాయంలో మెళకువలు, సాగుపై అవగాహన, పండించిన ధాన్యం కొనుగో లు చేసుకోని ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం 5వేల మం ది రైతులను కలిపి ఒక క్లస్టర్గా చేసి రైతు వేదికలను ఏర్పాటు చేసింది. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధ ర, పంట మొదలుకుని అమ్మే వరకు అవసరమయ్యే పరిజ్ఞానా న్ని వ్యవసాయాధికారుల నుంచి రైతులకు అందేలా ఈ రైతు వేదికలు దోహదపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామా ల్లోని రైతులంతా ఒక వద్దకు చేరుకోని ఏలాంటి పంటలు వే యాలి. ఏపంట వేస్తే లాభాలు వస్తాయి. వాటిని మార్కెట్కు ఏలా తరలించాలి, పంటలను ఆశించే చీడ పురుగులకు ఏలాం టి మందులు వాడాలి. వాటిపై వ్యవసాయాశాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సమావేశాలు నిర్వహించు కోవడానికి రైతు వేదికలు అడ్డాగా నిలుస్తున్నాయి.
జిల్లాలో 92 రైతు వేదికలు
ప్రతి 5వేల ఎకరాలను ఒక క్లస్టర్గా వ్యవసాయాధికారులు విభజించారు. ఒక్కో క్లస్టర్కు వ్యవసాయాధికారులు అందుబా టులో ఉంటారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 92 క్లస్టర్లుగా విభ జించడంతో పాటు క్లస్టర్ ఒకటి చొప్పున 92కు గాను 92 రైతు వేదికలను అధికారులు పూర్తిచేశారు. ఈ వేదికలతో అధికారు లు అందుబాటులో ఉండి క్లస్టర్ల పరిధిలో మట్టి నమూనాలు సేకరించి ప్రయోగాలు చేసేందుకు ఉపయోగపడుతాయి.
రైతుల సంఘటితం కోసమే
రైతులంతా ఒకే చోట కూర్చోని సమావే శం ఏర్పాటు చేసుకునేందుకు రైతు వేదిక లు ఎంతో దోహదపడుతాయి. ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులు ఏ పంటలు సాగు చేయాలనే దానిపై అవగాహన కల్పించడం జరుగుతుంది. రైతులకు వ్యవసా యాధికారులు అందుబాటులో ఉండడంతో ఏలాంటి సందే హలు ఉన్నా గ్రామంలోనే నివృతి చేసుకోవచ్చు.
-జిల్లా వ్యవసాయాధికారి అనురాధ