తుర్కపల్లి, జూలై 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామం. గ్రామాభివృద్ధికి గ్రామస్తు లు, వార్డు సభ్యులు సహకరిస్తున్నారు. గ్రామంలో 2, 203 మంది జనాభా ఉండగా అందులో 1,439 ఓటర్లు న్నారు. పురుషులు 735, స్త్రీలు 704 మంది ఉన్నారు. గ్రామపంచాయతీకి రెండేండ్లలో 14వ ఆర్థికసంఘం నిధు లు రూ.31,57,415 లక్షలు, ఎస్ఎఫ్సీ నిధులు రూ. 23,69,508 లక్షలు, జనరల్ ఫండ్ రూ.5,79,517 లక్ష లు మంజూరయ్యాయి. గ్రామంలో రూ.22 లక్షలతో ఏర్పాటు చేసిన రైతువేదిక భవనం పూర్తయి ప్రారంభాని కి సిద్ధంగా ఉంది. గ్రామంలో చేపట్టిన వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పంచాయతీకి మంజూరైన ప్రభుత్వ నిధులతో ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ట్యాంకర్ను కొనుగోలు చేశారు.
ట్రాక్టర్ సహాయం తో పారిశుధ్య కార్మికులు గ్రామంలోని చెత్తను సేకరించి ప్రతిరోజూ డంపింగ్యార్డుకు తరలించి గ్రామ స్వచ్ఛతకు పాటుపడుతున్నారు. వాటర్ ట్యాంకర్ సాయంతో హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పడుతూ.. మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. గ్రామంలోని కాలనీలో మొ త్తం 4వేల మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పంచాయతీ పాలకవర్గ సభ్యులు అధికారుల చొ రవతో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడంతో వందశాతం ఓడీఎఫ్ గ్రామంగా నిలిచింది. పల్లెప్రగతిలో భాగంగా శిథిలావస్థలో ఉన్న 40 ఇండ్లను యజమానుల అనుమతితో కూల్చేశారు. గ్రామంలోని నర్సరీలో ఏర్పాటు చేసిన 10 వేల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పల్లెప్రకృతివనంలో 2వేల మొక్కలను నాటారు. అంతేకాకుండా గ్రా మంలో రూ.34 లక్షలతో సీసీ రోడ్ల పనులు ప్రారంభించ గా 80శాతం పూర్తయ్యాయి. పంచాయతీ నిధులు రూ. 15 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ నిర్మా ణం పూర్తయింది. గ్రామంలో ఏర్పాటు చేసిన 147 విద్యు త్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లను అమర్చారు. రూ.1.80లక్షలతో గ్రామంలో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.