న్యూఢిల్లీ : కేబినెట్ విస్తరణకు కొద్ది గంటలకు ముందు ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గంగ్వార్ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి లోక్సభకు ఎన్నికైన రమేశ్ పోఖ్రియాల్ ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సంతోష్ గంగ్వార్ కార్మిక మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ను కేంద్రం కర్ణాటక గవర్నర్గా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో 81 మంత్రులకుగాను 53 మంది ఉన్నారు. రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు.