కవాడిగూడ, అంబర్పేట, జూలై 2: ప్రభుత్వం ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నదని, సామాజిక బాధ్యతతో ప్రజలు, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా హరితహారంలో భాగస్వామ్యం కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం కవాడిగూడ, అంబర్పేటలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ గడిచిన ఆరేండ్లలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తున్నదన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, కార్పొరేటర్లు రచనశ్రీ, విజయ్కుమార్గౌడ్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ల్చర్ మేనేజర్ సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.