న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 46,617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. కొత్తగా 59,384 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 853 మంది వైరస్ బారినపడి ప్రాణాలు విడిచారని మంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,58,251కు పెరిగాయి. 2,95,48,302 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు దేశంలో వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య నాలుగు లక్షల మార్క్ను దాటింది. ఇప్పటి వరకు వైరస్ ప్రభావంతో 4,00,312 మంది మృతి చెందారని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,09,637 ఉన్నాయని, టీకా డ్రైవ్లో భాగంగా 34,00,76,232 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.