సాగుకు సాంకేతికత తోడైతే మంచి ఫలితాలు

- మంత్రి జగదీశ్రెడ్డి
నల్లగొండ, ఫిబ్రవరి 13 : వ్యవసాయ సాగుకు సాంకేతికత సేవలు తోడైతే మంచి ఫలితాలు వస్తాయని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో ఉషా గార్డెన్స్లో సంహిత క్రాప్ కేర్ క్లినిక్స్ సీఈఓ గున్నం శ్యాంప్రసాద్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరించారు. బత్తాయి, నిమ్మ రైతులకు సలహాలు ఇవ్వడం హర్షణీమన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయం అభివృద్ధికి అనేక ఆధునిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తే మొదటగా ముఖ్యమంత్రి కేసీఆరే సంతోషపడతారని అన్నారు. ఈ సందర్భంగా పంటల సంరక్షణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కళ్యాణి, విజయ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
సహ చట్టంతో జవాబుదారితనం
నీలగిరి, ఫిబ్రవరి 13 : సమాచార హక్కు చట్టంతో జవాబుదారితనం పెరిగిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఓ హాల్లో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సత్యనారాయణగుప్తా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కన్నడ కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత
- ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్ వెంకన్న బ్రహ్మోత్సవాలు
- ఆమె రాజకీయ ఆటలోపడి లక్ష్యాలు మరిచారు: దినేశ్ త్రివేది
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?