వినయ భూషణుడు, విప్లవకారుడు, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు శత జయంతి నేడు. ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే పీవీపై బయోపిక్ రూపొందించాలని ఎప్పటి నుండో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. తాజాగా పీవీ బయోపిక్కి సంబంధించిన ప్రకటన వచ్చింది. ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్’ పతాకంపై భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు.
గతంలో రియల్ స్టార్ శ్రీహరితో ‘శ్రీశైలం’ అనే చిత్రాన్ని నిర్మించిన నిర్మాత తాడివాక రమేష్ నాయుడు పీవీ బయోపిక్కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో పీవీ నరసింహారావు పాత్రను జాతీయ స్థాయి నటుడు పోషించనున్నారట. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనుండగా, వచ్చే ఏడాది జూన్28న మూవీని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.