మేడ్చల్ మల్కాజిగిరి : డోర్ కర్టెన్ ఆ బాలుడి పాలిట మృత్యు పాశమైంది. ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటున్న బాలుడికి డోర్ కర్టెన్ ఉరితాడుగా మారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఘట్కేస్ర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇన్స్స్పెక్టర్ ఎన్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..ఘట్కేసర్ పట్టణం బ్రుక్బాండ్ కాలనీలో సామల శ్రీనివాస్, శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ టీవీ మెకానిక్గా పని చేస్తుండగా శాంతి స్థానిక హస్టల్లో వంట పనులు చేస్తుంది. వీరికి కుమారుడు భార్గవ్(11) మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
గురువారం ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు డోర్ కర్టెన్ భార్గవ్ మెడకు చుట్టుకుని కింద పడి పోయాడు. చిన్న పిల్లలకు అర్థం గాక ఏడుస్తు కూర్చున్నారు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న తల్లి కర్టెన్ మెడకు చూట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారున్ని ఇతరుల సహయంతో పక్కనే ఉన్న ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దంపతులు 10 సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి వలస వచ్చి నివాసం ఉంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసుల తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మినీ ఇండియాగా శ్రీరామ కాలనీ : మంత్రి సబిత
కాగజ్నగర్లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం