పటియాల: ఇండియన్ గ్రాండ్ ప్రి-4 టోర్నీలో యువ అథ్లెట్ ద్యుతీ చంద్ సత్తాచాటింది. సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసును ద్యుతి 11.17 సెకన్లలో ముగించింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత మార్క్ 11.05 సెకన్లు కాగా 0.02 సెకన్ల తేడాతో ఆమె అవకాశాన్ని కోల్పోయింది. 2019లో తన పేరిట నమోదైన రికార్డు (11.22సె)ను ద్యుతి తిరుగరాసింది. అయితే ప్రస్తుతం 43వ ర్యాంక్లో ఉన్న ద్యుతి.. తాజా ప్రదర్శనతో పాయింట్లు ఖాతాలో వేసుకుంటే 36వ ర్యాంక్కు చేరుకోవడం ద్వారా టోక్యో బెర్తు దక్కించుకునే చాన్స్ ఉందని కోచ్ రమేశ్ చెప్పారు. మరోవైపు షాట్పుటర్ తేజిందర్ సింగ్ తూర్ టోక్యోకు అర్హత సాధించాడు. ఇనుప గుండును 21.49 మీటర్లు విసిరి అతడు జాతీయ రికార్డును బద్దలుకొట్టాడు. అలాగే ఒలింపిక్స్ అర్హత మార్కు 21.10 మీటర్లను సునాయాసంగా దాటి విశ్వక్రీడల్లో చోటు దక్కించుకున్నాడు.