హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణకు చెందిన 19 మంది ప్రతిభ కల్గిన యువ సెయిలర్లు భారత నేవి, ఆర్మీలో ఉద్యోగాలు పొందారు. సెయిలింగ్లో అద్భుత ప్రదర్శనతో ఈ అవకాశం దక్కించుకున్నారు. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) కోచ్ సుహేమ్ షేక్ దగ్గర సెయిలింగ్లో వీరంతా శిక్షణ తీసుకుంటున్నారు. ఎంపికైన 19 మందిలో తొమ్మిది మంది తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఇందులో 14 ఏండ్ల మాలవత్ సునీల్ నేవికి ఎంపికైన తొలి గిరిజన బాలుడిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.