బెంగళూర్ : కొవిడ్-19 అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కర్నాటకలోని 17 జిల్లాల్లో సోమవారం హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్లు, రిసార్ట్స్ తెరుచుకున్నాయి. బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణాకూ అనుమతించారు. ఐదు శాతం లోపు పాజిటివిటీ రేటు నమోదైన జిల్లాల్లో కఠన నియంత్రణల నుంచి రాష్ట్ర ప్రభుత్వం భారీ సడలింపులు ఇవ్వడంతో ఆయా జిల్లాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది.
కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పలు జిల్లాలకు రాకపోకలు సాగించేలా ౩౦౦౦ బస్సులను సిద్ధం చేసింది. ఇక అవుట్ డోర్ ఫిల్మ్ షూటింగ్ కు కర్నాటక ప్రభుత్వం అనుమతించడంతో సినీ పరిశ్రమలో సందడి నెలకొంది. 50 శాతం ఆక్యుపెన్సీతో హోటళ్లు, రిసార్ట్స్, జిమ్ లను అనుమతించారు. వాకింగ్, జాగింగ్ చేసుకునేందుకు పార్క్ లను ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ తెరిచిఉంచుతారు. ప్రేక్షకులు లేకుండా స్టేడియంలలో క్రీడా ఈవెంట్లను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు.