ఢిల్లీ ,జూన్ 20: రైల్వే స్టేషన్లలో ప్రజలకువైఫైసౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చే బాధ్యతను రైల్ టెల్ కు రైల్వే శాఖ అప్పగించింది. డిజిటల్ సౌకర్యాల కల్పనకు రైల్వే ప్లాట్ఫామ్ను వేదికగా చేయాలన్న లక్ష్యంతో ఈ వ్యవస్థకు రూపకల్పన జరిగింది. ప్రస్తుతం దేశంలోని 6000కు పైగా రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రపంచంలో అతి పెద్ద సమీకృత వైఫై వ్యవస్థగా ఇది గుర్తింపు పొందింది. శ్రీనగర్ తో సహా కాశ్మీర్ లోయలోని 15 రైల్వే స్టేషన్ లను రైల్ వైఫై తో అనుసంధానం చేసినట్టు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ‘రైల్ వైర్’ పేరుతో భారతీయ రైల్వే అందిస్తున్న వైఫై సౌకర్యం కేంద్రపాలిత ప్రాంతమైన కాశ్మీర్ లోని నాలుగు జిల్లా ప్రధాన కేంద్రాలైన శ్రీనగర్, బుడ్గావ్, బనిహాల్,ఖాజిగుండ్ లలో ఉన్న15 రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది.