మావోయిస్టుకు భూమిపత్రాలు అందజేత
నిర్మల్ అర్బన్, జూన్ 19: మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని నిర్మల్ ఇంచార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్ తెలిపారు. 2019లో ఒగ్గు సట్వాజి, అతని భార్య డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. దీంతో వారిపై ఉన్న నగదు రివార్డు, ఇంటి స్థలాన్ని ఇదివరకే అందజేశారు. ప్రస్తుతం ఎస్పీ చొరవతో ప్రభుత్వ హామీ మేరకు వారికి కేటాయించిన ఐదెకరాల భూమి, పాస్బుక్ పత్రాలను శనివారం ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మావోయిస్టులు ఎవరైనా జనజీవన స్రవంతిలోకి వస్తే చేరదీయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు.