పల్లె ప్రగతి పనులను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలి

- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ రూరల్/ నల్లగొండ, జనవరి 12 : పల్లె ప్రగతిలో భాగంగా ఈజీఎస్ నిధులతో పంచాయతీరాజ్శాఖ ద్వారా చేపట్టిన పనులను ఫిబ్రవరి నెలాఖారులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీరాజ్ డీఈలు, ఏఈలు, ఏపీఓలు, కార్యదర్శులతో మాట్లాడారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్ల నిర్మాణాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వెనుకబడి ఉందని, నిర్లక్ష్యం వీడి పనులను వేగవంతం చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్(టీఏడీఏ) డైరీ, క్యాలెండర్ను కలెక్టర్ తన చాంబర్లో ఆవిష్కరించారు. ఆ సంఘం చైర్మన్, ఏడీఏ సుధారాణి, అధ్యక్షుడు నూతన్కుమార్, కళ్యాణ చక్రవర్తి, కీర్తి, సైదా, సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎన్నికల రోజును సెలవుదినంగా భావించొద్దు: మంత్రి కేటీఆర్
- తెలంగాణ టూరిజం అంబాసిడర్గా బిగ్బాస్ హారిక
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు