మరికల్, జూన్ 14 : మండల కేంద్రంలోని హరిజన్వాడలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ వాట ర్ ట్యాంక్ స్థలాన్ని సోమవారం భగీరథ ఈఈ వెంకట్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన వాట ర్ ట్యాంకుల నిర్మాణం జరుగుతుందని తెలిపా రు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ తాగునీరు అం దిస్తామని తెలిపారు. మండలంలో ఎక్కడ సమ స్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే మండల కేంద్రంలో నూ తనంగా నిర్మిస్తున్న ట్యాంక్ కెపాసిటీని పెంచాలని సర్పంచ్ కస్పే గోవర్ధన్ ఈఈ వెంకట్రెడ్డిని కోరారు. గ్రామంలో జనాభాకు సరిపడా వాటర్ ట్యాంకులు ఉన్నాయని, వాటర్ సరిపడకపోతే ఉన్నతాధికారులతో మాట్లాడి మరో ట్యాంక్ను మంజూరు చేయిస్తానని ఈఈ వెంకట్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీ గోపాల్, టీఆర్ఎస్ సీనియర్ నా యకులు రాజవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.