న్యూఢిల్లీ :రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పది లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. మొత్తం 10,81,300 వ్యాక్సిన్ డోసులు మరో మూడు రోజుల్లో రాష్ట్రాలకు చేరతాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 25,87,41,810 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇక రాష్ట్రాల వద్ద వ్యాక్సినేషన్ చేపట్టేందుకు ఇప్పటికీ 1,12,41,187 కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇక జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద ఇప్పటివరకూ దాదాపు 24 కోట్ల 96లక్షల 304 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.