న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని లాజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలోని షోరూమ్లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఉదయం 10.20 గంటల సమయంలో తమకు ప్రమాదానికి సంబంధించి సమాచారం వచ్చిందని, ఈ మేరకు 16 ఫైర్ టెండర్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం ఆ ప్రాంతంలో పొగ కమ్మివేసింది.