కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వారి పరిస్థితులని గమనించిన సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఈ కష్టకాలంలో రానా దగ్గుబాటి 400 గిరిజన కుటుంబాలను రక్షించడానికి ముందుకు వచ్చారు. నిర్మల్ జిల్లాలోని గిరిజన కుటుంబాలకు ప్రాథమికంగా అవసరమైన నిత్యావసరాలు కూడా ఇబ్బందిగా మారడంతో గిరిజన గ్రామాల్లోని మొత్తం సమూహంలోని ప్రజలకు కిరాణా సామాగ్రి మందులు అందించారు.
అలారంపల్లి బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతీలు .. గుర్రాం మధీరా, పాల రెగాడి, అడ్డాల తిమ్మపూర్, మీసాల భూమన్న గుడమ్,గగన్నపేట, కనిరామ్ తాండా, చింతగుడమ్, గోంగూరం గుడా, కడెం మండలాల కుగ్రామాలకు సాయం అందించారు రానా. ఆయన చేసిన ఈ పనిపై ప్రశంసల జల్లుకురుస్తుంది. మరోవైపు కళామతల్లి చేదోడు కార్యక్రమం ద్వారా 600 మంది సినీ వర్కర్స్ కు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్ రావు, యలమంచిలి రవిచంద్ తమవంతు సాయం అందించిన విషయం తెలిసిందే.