హైదరాబాద్ : తెలంగాణలో గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్ఎల్బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం లాక్డౌన్ను ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించడంతో పాటు సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే.
మేలో లాక్డౌన్ అమలు చేసిన నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారాయి. లాక్డౌన్ ప్రారంభంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, జూన్ ఒకటో తోదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించాయి. ఈ నెల 10 నుంచి లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. బ్యాకింగ్ సమయ వేళలను ఖాతాదారులు గమనించాలని ఎస్ఎల్బీసీ సూచించింది.