ఎత్తిపోతలను ఏడాదిలో పూర్తి చేస్తాం

- ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
దామరచర్ల : మండలానికి మంజూరైన ఎత్తిపోతల పథకాలను ఏడాదిలోగా పూర్తిచేసి సాగుకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లోని బొత్తలపాలెం-వాడపల్లి, అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి- చాంప్లాతండా ఎత్తిపోతల పథకాల ప్రదేశాలను ఎన్ఎస్పీ అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. లిఫ్ట్ల పరిధిలో చెరువులను నింపేందుకు, ఆయకట్టు స్థిరీకరణ, నీటి డిజైన్లపై రైతులు, ప్రజాప్రతినిధులు, ఎన్ఎస్పీ అధికార్లతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు మండలాల్లో మూడు ఎత్తిపోతలకు రూ. 525.08 కోట్లు విడుదలైనట్లు చెప్పారు. ఉమ్మడి మండలంలో 27,095 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. జనవరి 30నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. కేశవాపురం ఎత్తిపోతల పథకం టెండర్ పూర్తయ్యిందని తెలిపారు. ఎత్తిపోతల నిర్మాణాలకు రైతులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, స్కైలాబ్నాయక్, ఎండీ యూసూఫ్, సోము సైదిరెడ్డి, కోటిరెడ్డి, అడవిదేవులపల్లి ఎంపీపీ బాలూనాయక్, జడ్పీటీసీ కుర్ర సేవానాయక్, ఎన్ఎస్పీ ఆపరేషన్, మెయింటెనన్స్ శాఖ ఎస్ఈ విజయ్భాస్కర్, ఈఈ పీ రాము, డీఈలు వెంకట్రామ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
- స్టాఫ్నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు
- 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- రేడియోలాజికల్ ఫిజిక్స్లో ఎమ్మెస్సీ డిప్లొమా
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ