ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలు సడలించడం, రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా ఉండటం తో ఇన్వెస్టర్ల లో సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. కొన్నిమినహా మిగతా స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.
సెన్సెక్స్ 52,231.38 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,279.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,054.76 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.47శాతం అంటే 244.85పాయింట్లు ఎగిసి 52,338.48 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,725.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,725.10 వద్ద గరిష్టాన్ని, 15,678.10 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.59శాతం అంటే 91.90పాయింట్లు లాభపడి 15,762.75 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.