సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ): లోన్యాప్ కేసు.. బ్యాంకు ఖాతాల అక్రమ డీ ఫ్రీజ్ ఘటనలో నగదు ఎవరి చేతికి అందిందనే విషయంపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోల్కతా సైబర్క్రైమ్ పోలీసు పేరుతో కోల్కతాలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతాలను డీ ఫ్రీజ్ చేయించి… అక్కడి నుంచి హైదరాబాద్లోని ఆనంద్ జన్ను ఎస్బీఐ ఖాతాకు బదిలీ చేయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆనంద్జన్నును రెండు రోజుల క్రితం సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత సైబర్నేరస్తుడైన అనిల్తో జతకట్టిన ఆనంద్ జన్ను డబ్బులు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నట్లు విచారణలో వెల్లడయ్యిం ది. హైదరాబాద్ నుంచి ముంబైలోని యాక్సెస్ బ్యాంకులో ఉన్న అనిల్ ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయి. అక్కడి నుంచి వివిధ బ్యాంకుల్లోకి డబ్బులు బదిలీ చేసినట్లు సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఏఏ బ్యాంకులకు బదిలీ అయ్యాయి, ఎంత మొత్తంలో బదిలీ అయ్యాయి, అక్కడి నుంచి ఎవరి చేతికి వెళ్లాయి, చిట్ట చివరకు ఆ డబ్బు ఎవరికి అందిందనే విషయంపై నిగ్గు తేల్చే పనిలో సైబర్క్రైమ్ పోలీసులు ఉన్నారు.