నేడు నోముల సంతాప సభ

- నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటలకు..
- ఉమ్మడి జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు
నల్లగొండ : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సంతాప సభ ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభ మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనుంది. సభ ఏర్పాట్లను ఇప్పటికే యాదవ సంఘం నాయకులు పూర్తి చేశారు. సభకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, జైపాల్ యాదవ్, అంజయ్య, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం చైర్మన్ రాజయ్య, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబూరావు, జాతీయ కార్యదర్శి లక్ష్మణ్ తదితరులు హాజరుకానున్నారని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లోడంగి గోవర్ధన్ తెలిపారు.
సభను విజయవంతం చేయాలి : కుల సంఘాలు
నోముల సంతాప సభను విజయవంతం చేయాలని శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు నల్లగొండలోని యాదవ సంఘం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరారు. సమావేశంలో ఆయా సంఘాల నేతలు దుడుకు లక్ష్మీనారాయణ, మారపాక నరేందర్, కోనేటి నర్సింహ, పంకజ్ యాదవ్, తరాల పరమేశ్, మామిడి పద్మ, గోపాలకృష్ణ, గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పాటలు పాడే వేణువు సిద్ధం చేసిన గిరిజనుడు.. వీడియో
- టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అద్భుత స్పందన : మంత్రి కేటీఆర్
- బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..‘పుష్ప’ టీజర్కు ముహూర్తం ఫిక్స్
- డ్రగ్ సిండికేట్కు చెక్ : రూ 4 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు సీజ్!
- ఎస్యూవీ కార్లకు ఫుల్ డిమాండ్: ఫిబ్రవరి సేల్స్ మిక్చర్ పొట్లాం!!
- ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు శిక్ష
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం