న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) రద్దుచేసింది. దీంతో 1.75 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. ఇప్పటికే సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. ఎన్ఐఓఎస్ 12వ తరగతి పరీక్షలు ఈనెలలో జరగాల్సి ఉన్నాయి. ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ విధానంలో మార్కులను కేటాయించనుంది. ఈ విధానంతో సంతృప్తి చెందనివారు తర్వాత జరిగే పరీక్షలు రాయవచ్చని అధికారులు వెల్లడించారు.