సహకార రంగంపై అవగాహన ఉండాలి

డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి
నల్లగొండ: ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు సహకార రంగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సూచించారు. డీసీసీబీ కార్యాలయంలో బుధవారం నల్లగొండ జిల్లా పీఏసీఎస్ చైర్మన్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. పీఏసీఎస్లు బాగుంటేనే డీసీసీబీలు, టెస్కాబ్ బాగుంటాయని అన్నారు. టెస్కాబ్ సహకారంతో పీఏసీఎస్లకు అధిక నిధులు కేటాయించి బలో పేతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులకు కావాల్సిన రుణాలు ఇవ్వడంతో పాటు ఆర్థ్దికంగా ఆయా పీఏసీఎస్ అభివృద్ధ్దికి చైర్మన్లు, సీఈఓలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్రెడ్డి, డీసీఓ శ్రీనివాస మూర్తి, డీసీసీబీ సీఈఓ మదన్మోహన్, డైరెక్టర్లు కోడి సుష్మ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్బుక్తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- బార్బర్గా మారిన ప్రిన్సిపాల్.. విద్యార్థి హెయిర్కట్ సరిచేసిన వైనం
- మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్రెడ్డికే
- సామాన్యుడి చెంతకు న్యాయవ్యవస్థను తేవాలి : వెంకయ్యనాయుడు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్రావు