హైదరాబాద్ : తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రజలకు, ఉద్యోగులకు రాష్ర్ట ఆవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎస్. ఈ కార్యక్రమంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ అర్విందర్ సింగ్, సీనియర్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.