అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) 2021 విద్యా సంవత్సరానికిగాను ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలు కల్పిస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు మరో రెండు రోజుల్లో ముగుస్తున్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నది.
ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఎఫ్ఏ)
విభాగాలు: మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ డిజైన్, మాస్టర్స్ ఇన్ కన్జర్వేషన్ అండ్ రీజనరేషన్, మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చరల్ హిస్టరీ అండ్ రిసెర్చ్
అర్హత: ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీలో 50 మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఫ్యాకల్టీ ఆఫ్ ప్లానింగ్ (ఎఫ్సీ)
విభాగాలు: మాస్టర్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్, మాస్టర్స్ ఇన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సిస్టం, మాస్టర్స్ ఇన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాస్టర్స్ ఇన్ అర్బన్ హౌసింగ్, మాస్టర్స్ ఇన్ అర్బన్ డిజైనర్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ లేదా తత్సమాన డిగ్రీలో ఏదో ఒకటి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్లిస్టింగ్, అప్లికేషన్ ఎవాల్యుయేషన్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 4
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 19/20
వెబ్సైట్: https://admissions.cept.ac.in/postgraduate