శంషాబాద్ ఎయిర్పోర్టులో 689 గ్రాముల పుత్తడి పట్టివేత
శంషాబాద్, జూన్ 1: ప్యాంటుకు ప్రత్యేకంగా కుట్టించిన పాకెట్లో రూ.34 లక్షల విలువైన బంగారం గొలుసులు స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడు మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడ్డాడు. అతని నుంచి 689 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్కు వచ్చిన విమానం దిగిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్యాంట్ పాకెట్లో దాచిన బంగారం గొలుసులను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు.