కామారెడ్డి : లాక్డౌన్లో కొంతమంది వ్యాపారస్తులు అందినకాడికి దోచుకుంటున్నారు. పలు చోట్ల నిర్దేశించిన ధర కంటే అధిక ధరకు కల్లును విక్రయిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ కల్లు దుకాణంలో అధిక ధరకు కల్లు విక్రయిస్తుండటంతో.. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు దుకాణంతో పాటు అక్కడున్న ఓ ఆటోకు నిప్పు పెట్టారు. దీంతో దుకాణం, ఆటో పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై దుకాణం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.