వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ మండలం కేంద్రంలో విషాద ఘటన జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు బయల్దేరిన మహిళ దారిలోనే మృతి చెందింది. కడిపికొండకు చెందిన ఓ మహిళ (45) ఇటీవల అనారోగ్యానికి గురైంది.
కరోనా పరీక్ష చేయించుకునేందుకు స్థానిక పీహెచ్సీ బయల్దేరింది. పంచాయతీ కార్యాలయం వద్దకు రాగానే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కరోనా భయంతో మృతి చెందిందా.! లేక ఇతరాత్ర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయని తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.