చిక్కడపల్లి, మే 15 : వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం రాత్రి వీచిన గాలికి గాంధీనగర్ ప్రధాన రహదారికి పక్కన ఉన్న చెట్లు కింద పడిపోయాయి. స్పందించిన ఎమ్మెల్యే రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలిగించాలని శనివారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదిలో కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలు, నాలా పరీవాహక ప్రాంతాలు, కాలనీ ప్రజలు ఇబ్బందులు పడ్డారని వివరించారు. అందుకే ఈ సంవత్సరం వర్షాలు రాకముందే ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావలని ఎమ్మెల్యే స్థానికులకు తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, శ్రీకాంత్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఆకుల శ్రీనివాస్, అనిల్, మహేశ్ తదితరలు పాల్గొన్నారు.