కలెక్టర్ కే శశాంక
ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో వీడియోకాన్ఫరెన్స్
కరీంనగర్, మే 13 (నమస్తే తెలంగాణ);జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ కే శశాంక గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో ఉపాధి హామీ పనులపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీ య ఉపాధిహామీ పనుల్లో భాగంగా హరితహారం, నర్సరీలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంప్యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం తది తర పనులు చేపట్టాలని సూచించారు. సమయం వృథా చేయకుండా నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. కూలీలకు సంబంధించిన వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్దేశించారు. ఉపాధి హామీ పనుల్లో కూలీలు కరో నా నిబంధనలను పాటిస్తూ మాసులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ పనులు నిర్వర్తించేలా గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో చదువుకున్న యువతీ, యువకులు 18 సంవత్సరాలు పైబడిన వారికి ఉపాధి హామీ పనులను క ల్పించాలని, కరోనా కష్ట కాలంలో వారికి ఉపాధి పనులు కల్పించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసి, వారికి భరోసా కల్పించాలన్నారు. ప్రతి జీపీలో 250 మంది కూలీలు పనిచేసేలా చూడాలని తెలిపారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం ఎంతో ముఖ్యమైనదని, అన్ని గ్రామాల్లో ఎకువ మంది కూలీలకు కల్పించాలని తెలిపారు. ప్రతి మండలంలోని గ్రామాల్లో ప్రతి రోజు 60 మంది లోపు కూలీలకు పనులు కల్పించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పరిషత్ సీఈవో రమేశ్, జిల్లా పంచాయితీ అధికారి వీరబుచ్చయ్య, డీఎల్పీవో హరికిషన్, ఏపీడీ మంజులాదేవి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.