ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు నష్టపోగా… నిఫ్టీ 150 పాయింట్లకుపైగా క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ నష్టాల్లోనే కొనసాగింది. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదులుతున్నాయి. దీనికి తోడు కరోనా భయాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. కీలక రంగాల షేర్లు నష్టపోయాయి.
మార్కెట్ల నష్టాలకు కారణాలు..?
కరోనా కేసులు ఇలాగే పెరుగుతుంటే భారత వృద్ధి రేటు 8.2 శాతానికి పడిపోవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. దీనికి తోడు నాలుగు రోజుల లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపారు. దీంతో సూచీలు నష్టాల్లో ఉన్నాయి.